Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
దేశంలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా తగ్గాయి. సోమవారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 74,320 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 114 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,81,154కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,119 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు దేశంలో 5,30,726 మంది మరణించారు.
ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 0.01 కేసులు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయని వెల్లడించింది. రికవరీ రేటు 98.80 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.17 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.