Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ను ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర రావు పరామర్శించారు. గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య జనవరి 4వ తేదీన కన్నుమూశారు. ఈరోజు కరీంనగర్లోని గంగుల నివాసంల ద్వాదశ దిన కర్మ కార్యక్రమం జరిగింది. దాంతో, సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుండి కరీంనగర్ వెళ్లారు. గంగుల ఇంటికి వెళ్లి మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం మంత్రి కమలాకర్, అతని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆ తర్వాత హెలిక్యాప్టర్లో హైదరాబాద్కు తిరుగు ప్రయాణమమ్యారు. గంగుల మల్లయ్య చనిపోయిన రోజు సీఎం కేసీఆర్, గంగులకు ఫోన్ చేసి మాట్లాడారు. సంతాపం తెలియజేసి, కమలాకర్ను ఓదార్చారు. ఈరోజు దశ దిన కర్మ కావడంతో సీఎం స్వయంగా వెళ్లి మంత్రిని పరామర్శించారు.