Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ తిరుపతి: అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం చెన్నముక్కపల్లె రింగ్ రోడ్డు వద్ద ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అతడి కుమారుడు ఎంపీ మిథున్రెడ్డిలకు తృటిలో ప్రమాదం తప్పింది. బంధువుల ఇంటికి వెళ్తుండగా కాన్వాయ్లోని ఎంపీ మిథున్రెడ్డికి చెందిన వాహనాన్ని మరో కారు ఎదురుగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో ఆ వాహనం పల్టీలు కొట్టింది. వాహనంలో ప్రయాణిస్తున్న ఎంపీ వ్యక్తిగత కార్యదర్శి, భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి కుటుంబ సభ్యులంతా సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు పుంగనూరు నుంచి వీరబల్లిలోని అత్తగారింటికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే మంత్రి వాహనంలోనే ఆయన కుమారుడు మిథున్రెడ్డి కూడా ఉండటంతో వాళ్లకు ప్రమాదం తప్పింది.