Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయినప్పటికీ ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడికి తలొగ్గాయి. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడం కూడా మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 168 పాయింట్లు కోల్పోయి 60,092కి పడిపోయింది. నిఫ్టీ 61 పాయింట్లు పతనమై 17,894 వద్ద స్థిరపడింది. బేసిక్ మెటీరియల్స్, కన్జ్యూమర్ డిస్క్రీషనరీ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఫైనాన్స్ సూచీలు ఎక్కువగా నష్టపోయాయి.