Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి నుంచి గంగా విలాస్ క్రూయిజ్ నౌకా విహారాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. 27 నదీ మార్గాల్లో 51 రోజుల పాటు దాదాపు 3,200 కిలోమీటర్ల మేర ఈ నౌకాయానం సాగనుంది. భారత్, బంగ్లాదేశ్ లోని వివిధ చారిత్రక స్థలాలు, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఈ గంగా విలాస్ నౌక ముందుకు సాగనుంది. ఈ తరుణంలో బీహార్ లోని చాప్రా వద్ద ప్రతికూల పరిస్థితుల్లో ఈ నౌక నిలిచిపోయింది. చారిత్రక ప్రదేశం చిరంద్ ను దర్శించడం కోసం ఈ నౌక డోరిగంజ్ వెళ్లేందుకు ప్రయాణిస్తోంది. అయితే తీరం చేరుకునే క్రమంలో తగినంత నీటిమట్టం లేకపోవడంతో నదిలోనే నిలిచిపోయింది. దాంతో, అందులోని యాత్రికులను చిన్న పడవల్లో తీరానికి చేర్చారు. ఇక్కడి ఒడ్డున నీరు తక్కువగా ఉండడం, గంగా విలాస్ క్రూయిజ్ నౌకను తీరం వరకు తీసుకురావడం కష్టమని అధికారులు తెలిపారు.