Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రానికి మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సంస్థ రానుంది. సీ ఫర్ ఐఆర్ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనుంది. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో దావోస్లో జరుగుతున్న సదస్సులో తెలంగాణ నుంచి మంత్రి కేటీఆర్, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ పాల్గొన్నారు.
హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో సేవలు అందిస్తోన్న ఈ సంస్థ ఇప్పటికే అమెరికా, బ్రిటన్ దేశాల్లో విస్తరించింది. తాజాగా భారత్లో అడుగుపెడుతున్న ఈ సంస్థ తొలిసారిగా హైదరాబాద్లో ఏర్పాటు కానుంది.