Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. కాలిఫోర్నియా రాష్ట్రంలోని విసాలియా సిటీలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు. మరణించిన వారిలో ఓ మహిళతోపాటు ఆమె ఆరు నెలల చిన్నారి కూడా మృతి చెందింది. ఉదయం 3.30 గంటల సమయంలో ఓ ఇంట్లో కాల్పులు జరుగుతన్నాయనే సమాచారం వచ్చిందని తులారే కౌంటీ అధికారి షెరిఫ్ వెల్లడించారు. వెంటనే అప్రమత్తమై వెళ్లగా ఆ ఇంట్లో ఐదు మృతదేహాలను గుర్తించామని మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డట్టు తెలిపారు. ఆ వ్యక్తి ఆస్పత్రికి తీసుకెళ్లిన కాసేపటికి మరణించాడని చెప్పారు.కాగా, ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు అనుమానితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇవి సాధారణంగా జరిగిన హత్యలు కావని.. ఓ కుటంబాన్ని టార్గెట్ చేసుకుని హత్యచేశారని తెలిపారు.