Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా కీలక అడుగుపడింది. పాకిస్థాన్కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రసంస్థ డిప్యూటీ చీఫ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ‘అంతర్జాతీయ ఉగ్రవాది’ జాబితాలో చేరుస్తూ.. ఐరాస భద్రతా మండలి నిర్ణయం తీసుకుంది. మక్కీని యూఎన్ఎస్సీలోని ఐఎస్ఐఎల్, అల్ ఖైదా ఆంక్షల కమిటీ కింద 'గ్లోబల్ టెర్రరిస్ట్'గా జాబితాలో చేర్చాలని గతేడాది జూన్లో భారత్, అమెరికాలు సంయుక్తంగా ప్రతిపాదించాయి. ఈ ప్రతిపాదనను ‘నో ఆబ్జక్షన్ విధానం’ కింద కమిటీలోని 15 సభ్యదేశాలకు పంపారు. ఇందుకు చైనా చివర్లో అడ్డుపడింది. ఈ ప్రతిపాదనను టెక్నికల్ హోల్డ్లో ఉంచింది. భద్రతా మండలి విధి విధానాల ప్రకారం.. దీన్ని ఆరు నెలల వరకు కొనసాగించవచ్చు. ఈ క్రమంలో చివరకు యూఎన్ఎస్సీ సోమవారం మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.
ఎల్ఈటీ వ్యవస్థాపకుడు, 26/11 ముంబయి దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ సమీప బంధువు అయిన మక్కీ.. లష్కరే తొయిబా జమాద్ ఉద్దవాలో నాయకత్వ పదవులు కలిగి ఉన్నాడు. భారత్లో.. ముఖ్యంగా జమ్మూ- కశ్మీర్లో ఉగ్ర దాడులకు ప్రణాళికలు రూపొందించడం, నిధుల సేకరణ, యువతను ప్రేరేపించడం వంటివాటి వెనుక అతడి హస్తం ఉంది. దేశీయ చట్టాల ప్రకారం భారత్, అమెరికాలు.. ఇప్పటికే మక్కీని ఉగ్రవాదిగా గుర్తించాయి.