Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. రియాల్టీ, పవర్, ఐటీ సూచీల అండతో మార్కెట్లు లాభాల్లో పయనించాయి. ఏసియా-పసిఫిక్ మార్కెట్లు లాభాల్లో ముగియడం, యూరోపియన్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కావడం మన మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 563 పాయింట్లు లాభపడి 60,655కి పెరిగింది. నిఫ్టీ 158 పాయింట్లు పెరిగి 18,053కి ఎగబాకింది.