Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం
ప్రగతిశీల నేతలు ఒక్కటి కావాలని అఖిలేశ్ యాదవ్ పిలుపునిచ్చారు. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభలో యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ పాల్గోన్నారు. ఈ తరుణంలో ఆయన మాట్లాడుతూ ఈ సభకు వచ్చిన జనమే దేశానికి సంకేతం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మాణం ప్రజాసమస్యలకు పరిష్కారంగా నిలుస్తుందని, ఖమ్మం సభ చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
కేంద్రం ఢిల్లీలో కూర్చోని ఒక్కొక్క రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తోందని అన్నారు. 400 రోజుల తర్వాత కేంద్ర సర్కార్ ఉండదని, ఆ ప్రభుత్వానికి ఇంకా 399 రోజులు మాత్రమే ఉన్నాయన్నారు. కిసాన్ డిమాండ్లను బీజేపీ ప్రభుత్వం తీర్చడం లేదన్నారు. రైతుల ఆదాయం 2022 నాటికి రెట్టింపు చేస్తామన్నారు, కానీ బీజేపీ విఫలమైందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని వెళ్లగొట్టేందుకు ఇక్కడ నుంచి ప్రయత్నాలు జరగాలన్నారు.
తెలంగాణలో బీజేపీని తరిమికొట్టండి, యూపీ నుంచి కూడా ఆ పార్టీని వెళ్లగొడుతామని అఖిలేశ్ అన్నారు. ఈ క్రమంలోనే ప్రగతిశీల నేతలు ఒక్కటి కావాలన్నారు. గంగా నదిని శుభ్రం చేస్తామన్నారు. తెలంగాణ ప్రవేశపెట్టిన పథకాలను కేంద్రం కాపీ కొడుతోందన్నారు. బీజేపీ కేవలం భ్రమలు కల్పిస్తుందని, చాలా జాగ్రత్తగా ఉండాలని, ఖమ్మం సభకు ఆహ్వానించినందుకు ఆయన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.