Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
హైదరాబాద్ అమీర్పేటలోని వివేకానందా కమ్యూనిటీహాల్లో కంటివెలుగు శిబిరాన్ని మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ తరుణంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ తెలంగాణలో ప్రతి పథకం దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నాయని, కంటివెలుగును పంజాబ్, ఢిల్లీలో అమలు చేస్తామనడం తెలంగాణకు గర్వకారణమని అన్నారు.
ఈ క్రమంలోనే నేటినుంచి రెండో విడుత కంటివెలుగు ప్రారంభమైందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 16,533 కేంద్రాల్లో కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇందుకోసం 1500 బృందాలను ఏర్పాటు చేశామని, ఒక్కో టీమ్లో 8 మంది సిబ్బంది ఉంటారని తెలిపారు. వంద రోజుల్లో కోటిన్నర మందికి పరీక్షలు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నామన్నారు. కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.