Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : హీరో మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ల తర్వాత చేసిన మాస్ ఎంటర్ టైనర్ 'వాల్తేరు వీరయ్య' ఘన విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లోనూ సినిమా సత్తా చాటుతోంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని యువ దర్శకుడు బాబీ తెరకెక్కించిన తీరు అబిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దాంతో, చిత్రం భారీ వసూళ్లు రాబడుతోంది. మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఇంకా దూసుకుపోతోంది. ఆరు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 157.15 కోట్ల గ్రాస్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 121.35 కోట్లు వచ్చాయి. అమెరికాలోనూ ఈ చిత్రం ప్రభంజనం సృష్టిస్తోంది. యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ల (రూ.16 కోట్లు) మార్కెట్ అందుకుంది. ఈ ఏడాది ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. ప్రస్తుత జోరు చూస్తుంటే ఈ వారంతాంలోనే మెగా స్టార్ చిత్ర రూ. 200 కోట్ల మార్కు దాటేలా ఉంది.