Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబయి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాలతో ముగిశాయి. ఉదయమే ప్రతికూలంగా ప్రారంభమైన మార్కెట్లు ఏ దశలోనూ లాభాల్లోకి రాలేకపోయాయి. దీంతో గత రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. బడ్జెట్, త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. మరోవైపు ఈరోజు వీక్లీ ఎక్స్పైరీ కూడా సూచీలపై ప్రభావం చూపింది. దీనికి విదేశీ మదుపర్ల అమ్మకాలు జతకావడంతో మార్కెట్లు నష్టాలు చవిచూశాయి.