Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నైట్ ఫ్రాంక్ ఇండియా
· 2022 జనవరి – డిసెంబర్ లో 68,519 యూనిట్లు లేదా రూ.33,605 కోట్ల విలువైన నివాసఆస్తులు రిజిష్టర్ అయ్యాయి.
· 2022 డిసెంబర్ లో రిజిష్టర్ అయిన మొత్తం ఇళ్లలో 54% రూ.25-50 లక్షల ధర శ్రేణిలో ఉన్నాయి
· రిజిష్టర్ అయిన మొత్తం ఇళ్లలో 70% 1,000 – 2,000 చ.అ.ల ఇళ్లు ఉన్నాయి
· అధిక టికెట్ సైజ్ ఇళ్లకు డిమాండ్ అధికంగా ఉంది. రూ.50 లక్షలు, అంతకు మించి విలువైన ఇళ్ల వాటా 2021 డిసెంబర్ లో 24% గా ఉండగా, 2022 డిసెంబర్ లో అది 29% గా ఉంది.
హైదరాబాద్: 2022 డిసెంబర్ లో హైదరాబాద్ లో 6,311 నివాస ఆస్తులు రిజిష్టర్ కాగా, నెల వారీ ప్రాతిపదికన 2.4% వృద్ధి చోటు చేసుకున్నట్లుగా నైట్ ఫ్రాంక్ ఇండియా తన తాజా మదింపులో గుర్తించింది. 2022 డిసెంబర్ లో రిజిష్టర్ అయిన మొత్తం ఆస్తుల విలువ రూ.3,176 కోట్లుగా ఉంది. ఈ ఏడాది ప్రారంభం నాటి నుంచి నగరంలో రిజిష్టర్ అయిన 68,519 రెసిడెన్షియల్ యూనిట్ల మొత్తం విలువ రూ.33,605 కోట్లు కాగా, గత ఏడాది ఇదే కాలానికి రిజిష్టర్ అయిన 83,959 రెసిడెన్షియల్ యూనిట్ల మొత్తం విలువ రూ.37,232 కోట్లుగా ఉంది. హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ లో హైదరాబాద్, మేడ్చల్ – మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి.
2022 డిసెంబర్ లో రిజిస్ట్రేషన్ అయిన మొత్తం యూనిట్లలో రూ.2.5 – 5 మిలియన్ల (రూ.25 లక్షలు – 50 లక్షల) మధ్య ధర శ్రేణిలో ఉన్న రెసిడెన్షియల్ యూనిట్లు 54%గా ఉన్నాయి. 2021 డిసెంబర్ లో వీటి వాటా 36%గా ఉండింది. రూ. 2.5 మిలియన్ల (రూ.25 లక్షలు) కన్నా తక్కువ టికెట్ సైజ్ లో డిమాండ్ బలహీనమైంది. ఒక ఏడాది క్రితం దీని వాటా 40% ఉండగా, ఇప్పుడు అది 17% గా ఉంది. పెద్ద టికెట్ సైజ్ ఇళ్లకు అధిక డిమాండ్ అ లా కొనసాగుతూనే ఉంది. రూ.5 మిలియన్లు, అంతకు మించి (రూ.50 లక్షలకు పైబడి) టికెట్ సైజ్ కలిగిన ఆస్తుల రిజిస్ట్రేషన్ల విలువ వాటా 2021 డిసెంబర్ 24%గా ఉండగా, 2022 డిసెంబర్ లో అది 29 శాతానికి పెరిగింది. 2021 డిసెంబర్ లో, 500-1,000 చ.అ. పరిమాణంలోని ఆస్తుల యూనిట్ విభాగంలో రిజిస్ట్రేషన్ల వాటా 18%గా ఉండగా, అది 2022 డిసెంబర్ నాటికి 20 శాతానికి పెరిగింది. 1,000 చ.అ.లు లేదా అంతకు మించిన పరిమాణంలో ఆస్తుల వాటా 2021 డిసెంబర్ లో 73% గా ఉండగా, 2022 డిసెంబర్ లో అది 70 శాతానికి తగ్గింది. జిల్లా స్థాయిలో చూస్తే, ఇంటి విక్రయాల రిజిస్ట్రేషన్లు మేడ్చల్ – మల్కాజ్ గిరి జిల్లా 42%గా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 36%గా ఉన్నాయి. 2022 డిసెంబర్ లో హైదరాబాద్ జిల్లా వాటా 16%గా ఉంది.
లావాదేవీలు జరిగిన నివాస ఆస్తుల వెయిటెడ్ సగటు ధరలు ఏటేటా ప్రాతిపదికన 2022 డిసెంబర్ లో 16% మేర పెరిగాయి. సంగారెడ్డి జిల్లాలో 2022 డిసెంబర్ లో ఏటేటా ప్రాతిపదికన ధరలు 30% పెరగడం అనేది ఈ కాలంలో ఈ ప్రాంతంలో మరింత అధిక విలువ కలిగిన ఇళ్లు విక్రయమైనట్లుగా సూచిస్తోంది. 2022 డిసెంబర్ లో అధిక విలువైన ఆస్తుల విక్రయంతో హైదరాబాద్ లో ధర వృద్ధి ఇటీవలి కాలంలో పటిష్ఠమైంది.
ఈ సందర్భంగా నైట్ ఫ్రాంక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ ‘‘హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ ఎంతో విశిష్టమైంది. స్థితిస్థాపకతను ప్రదర్శించింది. స్టాంప్ డ్యూటీ రిబేట్లు వంటి ఏవిధమైన మినహాయింపులు (ముంబై, పుణె, బెంగళూరు, కోల్ కతా మాదిరిగా) లేనప్పటికీ, గత కొన్నేళ్లుగా హైదరాబాద్ లో గణనీయ వేగంతో రెసిడెన్షియల్ విక్రయాలు అధికమవుతున్నాయి. నగరంలో ఐటీ / ఐటీఈఎస్ రంగం నిరంతర పెరుగుదలతో నగరం ఆర్థిక ఫండమెంటల్స్ పటిష్ఠం కావడంతో, రెసిడెన్షియల్ మార్కెట్ నుంచి అదే విధమైన స్పం దన వస్తోంది. గత కొన్నేళ్లలో డిమాండ్ ఎంతగానో పెరిగింది. పని చేసే సిబ్బంది సంఖ్య గణనీయంగా పెరుగు తుండడంతో పాటుగా ఆర్థిక వృద్ధి, ఆర్థిక స్థిరత్వం, అందుబాటు ధరలు లాంటి వాటితో రెసిడెన్షియల్ డిమాండ్ పెరుగుతోంది. నగరం ఆర్థిక వృద్ధి ఇలానే ఉండగలదని భావిస్తున్న నేపథ్యంలోఈ డిమాండ్ ధోరణి రాబోయే ఏళ్లలో కొనసాగనుంది’’” అని అన్నారు.
నైట్ ఫ్రాంక్ ఇండియా సీనియర్ బ్రాంచ్ డైరెక్టర్ శామ్సన్ ఆర్థర్ మాట్లాడుతూ, “వడ్డీ రేట్లు పెరుగు తున్నప్పటికీ, మాంద్యం రావచ్చన్న ఆందోళన ఉన్నప్పటికీ, విస్తరిస్తున్న సామాజికార్థిక వాతావరణం, అత్యాధు నిక మౌలిక వసతులు, వ్యాపార స్నేహపూర్వక పాలనలతో హైదరాబాద్ లో డిమాండ్ కూడా అధికమవుతోంది. ఈ ఏడాది అంతా కూడా అధిక విలువ కలిగిన ఇళ్ల విక్రయాల్లో పెరుగుదల అనేది నగరం సానుకూల దృక్ప థాన్ని స్పష్టంగా చాటిచెబుతోంది” అని అన్నారు.