Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఈ నెల 18వ తేదీన యాదాద్రిలో వీవీఐపీల పర్యటనలు, ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం, కంటి వెలుగు కార్యక్రమంతో పాటు బీఆర్ఎస్ భారీ బహిరంగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు చోటు చేసుకోకుండా, కృషి చేసిన పోలీసు అధికారులను డీజీపీ అంజనీ కుమార్ అభినందించారు.
ఈ తరుణంలో తమ పరిధిలోని అధికారులతో సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలుగకుండా విజయవంతంగా నిర్వహించినందుకు గాను పోలీసు అధికారులను అభినందిస్తూ ప్రశంసా పత్రాలను అందించారు. పోలీస్ సూపరింటెండెంట్ పైస్థాయికి చెందిన 27 మంది పోలీసు అధికారులకు ఈ కమెండేషన్ సర్టిఫికెట్లను అందజేశారు. ఇదే స్పూర్తితో పని చేసి ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో పని చేయాలని డీజీపీ అంజనీ కుమార్ సూచించారు.