Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: గాంధీభవన్లో శుక్రవారం సాయంత్రం కొన్ని ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. టీపీసీసీ ఇన్ఛార్జి మాణిక్ ఠాక్రే ‘హాథ్ సే హాథ్’ కార్యక్రమంపై పార్టీ నేతలతో చర్చించేందుకు శుక్రవారం గాంధీభవన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఠాక్రేను కలిసేందుకు వచ్చిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో ఏకాంతంగా భేటీ అయ్యారు. కాసేపు వీరిద్దరూ సీరియస్గా చర్చించుకోవడం కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి రేపింది. మునుగోడు ఉపఎన్నిక తర్వాత టీపీసీసీకి, కోమటిరెడ్డి మధ్య గ్యాప్ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు ఏదో అంశంపై సీరియస్గా చర్చించుకోవడంపై పార్టీ నేతలతో పాటు మీడియా వర్గాలకు కూడా ఆసక్తిగా మారింది.
అంతకు ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘‘ మాణిక్రావు ఠాక్రే నాకు ఫోన్ చేశారు.. అందుకే ఆయనతో భేటీ అయ్యేందుకు వచ్చా. నా నియోజకవర్గ పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఇటీవల రాలేకపోయా. నేనెప్పుడూ గాంధీ భవన్కు రానని చెప్పలేదు. కాంగ్రెస్ను ఎలా అధికారంలోకి తేవాలో భేటీలో చెబుతా. ఖమ్మం లాంటి సభలు కాంగ్రెస్ వందల్లో పెట్టింది. ఎన్ని సభలు పెట్టినా కేసీఆర్ ఏం చేయలేరు’’ కోమటిరెడ్డి అన్నారు.