Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
ప్రతి నెలా 5వ తేదీ నాటికి 90-95% ఉద్యోగుల జీతాలు, పింఛన్లను ప్రభుత్వం చెల్లిస్తోంది. మిగిలిన 5% మందికి ఖజానాలో బిల్లులు సమర్పించిన తేదీకి అనుగుణంగా చెల్లింపులు జరుగుతున్నాయి. ఉద్యోగుల జీతాల బిల్లులు ఖజానా అధికారులు నెలాఖరులోగా సమర్పించగలిగితే ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వగలం అని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్నారు. ఈ మేరకు శనివారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రిజర్వు బ్యాంకు, బ్యాంకుల సెలవులు, రాష్ట్రంలో నిధులు (వేస్ అండ్ మీన్స్- చేబదుళ్లు) అందుబాటులో ఉన్న పరిస్థితుల ఆధారంగా ఈ చెల్లింపులు సాగుతున్నాయని, ఇంతకుముందు, ఇప్పుడు ఇదే పద్ధతి కొనసాగుతోందన్నారు.