Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భోపాల్: సుమారు 6.6 కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద తిరుగాడిన డైనోసార్ల గుడ్లను, గూళ్లను గుర్తించినట్లు ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్, రీసెర్చ్కు చెందిన శిలాజ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ వివరాలు పీఎల్ఓఎస్ ఒన్ జర్నల్లో ఈ వారం ప్రచురితమయ్యాయి. ఆ అధ్యయనం ప్రకారం.. మధ్యప్రదేశ్లోని నర్మదా నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న బాగ్, కుక్షి ప్రదేశాల్లో జరిపిన తవ్వకాల్లో పొడవాటి మెడతో ఉండే శాకాహారులైన టైటానోసార్లకు చెందిన 256 గుడ్లు, పలు గూళ్లు బయటపడ్డాయి. అసాధారణ రీతిలో ఇక్కడ వీటి నివాసాలు బాగా దగ్గర దగ్గరగా ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇక్కడ లభించిన గుడ్లన్నీ బహుళ పెంకులతో నిర్మితమై ఉండడాన్ని వారు గమనించారు. పొదగడానికి అనువైన పరిస్థితులు లేనపుడు తల్లి తన గుడ్లను అండవాహికలోనే ఉంచుకోవడంతో.. పెంకుమీద పెంకు ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు.