Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఆదివారం ఉదయం ఏడు గంటలకు జమ్ము డివిజన్లోని కతువా జిల్లాలోని హిరనగర్ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ఆదివారం తిరిగి ప్రారంభించారు. దీనిలో జమ్ముకశ్మీర్ పార్టీ అధ్యక్షుడు వికార్ రసూల్ వని, వర్కింగ్ ప్రెసిడెంట్ రమణ్ భల్లా, వందల కొద్దీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఉదయం 8 గంటలకు యాత్ర సాంబ జిల్లాలోకి చేరుకొంది.
నేడు దాదాపు 25 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత చక్ నానక్ వద్ద యాత్రకు విరామం ఇవ్వనున్నారు. రేపు ఉదయం తిరిగి యాత్రను ప్రారంభిస్తారు. అయితే జనవరి 30 నాటికి భారత్ జోడో యాత్రను పూర్తి చేయాలన్నది కాంగ్రెస్ వర్గాల ప్రణాళిక. ఈ క్రమంలో భద్రతాపరమైన కారణాల రీత్యా ఏ మార్గంలో యాత్ర నిర్వహించాలనే నిర్ణయాన్ని కాంగ్రెస్ శ్రేణులు అధికారులకే వదిలేశాయి.