Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
గణతంత్ర దినోత్సవం రోజున ఉగ్రవాద దాడులకు పాల్పడుతామంటూ ప్రత్యేక ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థ, నిషేధిత సిక్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్ జే) ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను హెచ్చరికలు జారీ చేశాడు. జనవరి 26న ఇళ్లలోనే ఉండండి ఢిల్లీనే మా టార్గెట్ ఖలిస్తాన్ జెండాను మేం ఎగురవేస్తాం అంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
2023లో భారతదేశ ఆక్రమణ నుంచి పంజాబ్ కు విముక్తి కల్పిస్తానని అందులో తెలిపారు. పైగా ఎర్రకోటపై ఖలిస్తాన్ జెండా ఎగురవేసిన వాళ్లకు 5 లక్షల డాలర్ల (సుమారు 4 కోట్ల రూపాయలు)ను ఇస్తానని ప్రకటించాడు. ఈ వీడియోపై స్పందించిన లాయర్ వీనీత్ జిందాల్, ఎస్ఎఫ్ జే, గురుపత్వంత్ సింగ్ పన్నుపై సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఎస్ఎఫ్ జే, గురుపత్వంత్ సింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. ఈ తరుణంలో గురుపత్వంత్ సింగ్ ను ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది.