Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లి
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్యకేసులో విచారణ కొలిక్కి వస్తోంది. ఈ తరుణంలో ఈ కేసుకు సంబంధించి 3,000 పేజీల డ్రాఫ్ట్ ఛార్జిషీట్ను సిద్ధం చేశారు. ఫోరెన్సిక్, ఎలక్ట్రానిక్ ఆధారాలు, 100 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. వీటి ఆధారంగా తుది ఛార్జిషీట్కు ఓ రూపు ఇవ్వనున్నారు. అలాగే ఆఫ్తాబ్ అంగీకార వాంగ్మూలం, నార్కో పరీక్షల నివేదికను కూడా దీనికి జతచేయనున్నారు. ప్రస్తుతం ఇది న్యాయనిపుణుల సమీక్షలో ఉంది. ఈ నెలాఖరుకు దీనిని న్యాయస్థానంలో దాఖలు చేసే అవకాశాలున్నాయి. మరోవైపు అఫ్తాబ్ నుంచి సేకరించిన సమాచారం మేరకు పోలీసులు దక్షిణ ఢీల్లీలోని పలు చోట్ల నుంచి ఇప్పటికే 13 మానవ ఎముకలను స్వాధీనం చేసుకొన్నారు. వాటి డీఎన్ఏలు కూడా శ్రద్ధా తండ్రి డీఎన్ఏతో సరిపోలాయి.