Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : పంజాబ్లోని అమృత్సర్ జిల్లా భారత్- పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో భద్రతా దళాలు ఆదివారం సాయంత్రం ఓ డ్రోన్ను కూల్చివేశాయి. బీఎస్ఎఫ్ దళాలు, అమృత్సర్ పోలీసులతో కూడిన జాయింట్ పెట్రోలింగ్ పార్టీ లపోకె ప్రాంతంలో భారీ శబ్ధం వినిపించడంతో ఆరు రెక్కలు కలిగిన డ్రోన్ను గుర్తించి కాల్పులు జరిపి నేలమట్టం చేశారు. గ్రామంలో గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా సిబ్బంది ఐదు కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులు పారిపోతుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, డ్రోన్ పరికరాలు అమెరికా, చైనాలో తయారైనవిగా గుర్తించామని పంజాబ్ డీజీపీ తెలిపారు. ఆయా దేశాల నుంచి దిగుమతి చేసుకున్న పరికరాలతో డ్రోన్ను అసెంబ్లింగ్ చేసినట్టు వెల్లడైందని డీజీపీ చెప్పారు.