Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ రంగంతో పాటు పలు సామాజిక రంగాల్లో సేవలు అందిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ, రామచంద్ర మిషన్ ప్రతినిధులు ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్లో త్వరలో నిర్వహించనున్న ఆధ్యాత్మిక సమ్మేళనానికి హాజరు కావాల్సిందిగా మిషన్ ప్రస్తుత ఆధ్యాత్మిక గురువు కమలేశ్ పటేల్ సీఎం కేసీఆర్ను ఆహ్వానించారు. తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. వారి వెంట మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తదితరులు ఉన్నారు.