Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నారాయణపేట
నారాయణపేట జిల్లాలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పర్యటించనున్నారు. హోంమంత్రి మహమూద్ అలీ, నిరంజన్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. నారాయణపేట మండలం సింగారం వద్ద భారత్ రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలకు శంకుస్థాపన చేయనున్నారు. సమీకృత మార్కెట్, సఖీ కేంద్రాన్ని మంత్రులతో కలిసి కేటీఆర్ ప్రారంభోత్సవం చేస్తారు. కొండారెడ్డిపల్లి చెరువు మినీ ట్యాంక్ బండ్, సీనియర్ సిటిజన్ పార్క్కు ప్రారంభోత్సవం చేస్తారు. ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.