Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నెల్లూరు
జిల్లాలోని రాపూరు గిరిజన గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థినిలు మిస్సింగ్ కలకలం రేపుతోంది. జ్యోతి, నాగమణి, అంకిత అనే ముగ్గురు విద్యార్థినిలు పదవ తరగతి చదువుతున్నారు. రాత్రి హాజరు సమయంలో మిస్సింగ్ అయినట్లు పాఠశాల సిబ్బంది గుర్తించారు. విద్యార్థినిల అదృశ్యంపై అర్ధరాత్రి ఉపాధ్యాయులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ అయిన విద్యార్థినిలు రాపూరు, కలువాయి, పొదలకురుకు చెందిన వారుగా గుర్తించారు.