Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని అప్పులపాలైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం... చంపాపేట్ సాయిరాంనగర్లో నివాసం ఉండే బి.మోహన్ కృష్ణ(24) ఓ సంస్థలో అసిస్టెంట్ సిస్టం ఇంజనీర్. తండ్రి మూడేళ్ల క్రితమే చనిపోవడంతో తల్లి, అన్నయ్య, వదినలతో కలిసి ఉంటున్నాడు. కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడి అందుకు అప్పులు చేశాడు. ఇంటివద్ద నుంచే పని చేస్తున్న అతడు.. ఆదివారం ఉదయం బయటకు వెళ్లాడు. సోమవారం ఉదయం బొల్లారంబజార్- అల్వాల్ రైల్వేస్టేషన్ల మధ్య ఓ యువకుడు మృతదేహం రైలు పట్టాలపై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహం వద్ద లభ్యమైన సెల్ఫోన్ ఆధారంగా మోహన్కృష్ణగా తేల్చారు. కుటుంబసభ్యుల ద్వారా ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు.