Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హకీంపేట్ : జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి కొండగట్టుకు వెళ్తున్నారు. ఆయన హకీంపేట్ వద్ద ట్రాఫిక్లో చిక్కుకున్నారు. లారీ రిపేర్ కావటంతో హకీంపేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ను క్లియర్ చేసి పోలీసులు కాన్వాయ్ను పంపించేశారు. అంజన్న సన్నిధిలో వారాహికి జనసేనాని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కొడిమ్యాల(మం) నాచుపల్లిలో తెలంగాణ జనసేన ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు పార్టీ కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు.