Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: జేఈఈ(మెయిన్) పరీక్షలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. 2023 జనవరి సెషన్ పరీక్షలకు దేశవ్యాప్తంగా 8.6 లక్షల మంది అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో బాలురు 6 లక్షలకుపైగా ఉండగా, బాలికలు 2.6 లక్షల మంది ఉన్నారు. తెలంగాణ నుంచి 86,840 మంది పరీక్షకు హాజరుకానున్నారు. దేశంలోని 290 నగరాలతోపాటు, దేశం బయట 18 నగరాలలో పరీక్ష నిర్వహించనున్నట్టు ఎన్టీఏ(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) తెలిపింది. పరీక్షలు ఫిబ్రవరి 1వ తేదీ వరకు కొనసాగుతాయి. జేఈఈ(మెయిన్) రెండో సెషన్ను ఈ ఏడాది ఏప్రిల్ 6 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు ఎన్టీఏ తెలిపింది.