Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : నెల్లూరు జిల్లా రాపూరు గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదివే ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. సోమవారం సాయంత్రం 7గంటల నుంచి అంకిత, మల్లిక జ్యోతి, నాగమణి అనే ముగ్గురు బాలికలు కనిపించటం లేదని పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అర్థరాత్రి పోలీస్ స్టేషన్లో ఉపాధ్యాయులు ఫిర్యాదు చేశారు. కనిపించకుండా పోయిన విద్యార్థినులు రాపూరు, కలువాయి, పొదలకూరుకు చెందినవారని పాఠశాల సిబ్బంది తెలిపారు. గతంలోనూ ఈ పాఠశాల నుంచి విద్యార్థులు కనిపించకుండా పోవటం గమనార్హం.