Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: మెట్రో రైలులో తలెత్తిన సాంకేతిక సమస్యను అధికారులు పరిష్కరించారు. అమీర్పేట్ - రాయదుర్గం మార్గంలో సాంకేతిక లోపం కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో రాయదుర్గం - అమీర్పేట్ ఒకవైపు మార్గంలోనే రైళ్ల రాకపోకలు సాగించారు. ఒకే రూట్లో రాకపోకలు సాగించడంతో మెట్రో రైళ్లు ఆలస్యంగా నడిచాయి. సంబంధిత కారిడార్లో అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అమీర్పేట్ మెట్రో స్టేషన్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. దాదాపు అరగంట తర్వాత సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో అమీర్పేట్ - రాయదుర్గం మార్గంలో రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి.