Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మంత్రులు కేటీఆర్, మహమూద్ ఆలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ల అధ్యక్షతన బుధవారం ఉదయం 10 గంటలకు బీఆర్కె భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరగనుంది. గ్రేటర్లో వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు, పురాతన భవనాలు, అక్రమ నిర్మాణాల కూల్చివేతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. డెక్కన్ భవనం అగ్ని ప్రమాద ఘటనపై ప్రధానంగా చర్చించి పలు కీలక ఆదేశాలు జారీ చేయనున్నారు.