Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : యూకో బ్యాంక్ లో ఓ ఉద్యోగి మోసానికి పాల్పడ్డాడు. బంగారు తాకట్టు పెడుతున్న ఖాతాదారులను ఉద్యోగి బురిడీ కొట్టించాడు. ఖాతాదారుల నుంచి బంగారం తీసుకుని బ్యాంకులో నకిలి బంగారు జమ చేసి రూ. 2 కోట్ల వరకు బ్యాంకుకు ఉద్యోగి శ్రీనివాసరావు కుచ్చుటోపి పెట్టాడు. కొట్టేసిన బంగారాన్ని వేరేచోట తాకట్టు పెట్టి భారీగా అప్పులు తీసుకున్నాడు. విషయాన్ని గమనించిన యూకో బ్యాంక్ అధికారులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.