Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కల్యాణ్పై సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం పవన్ కల్యాణ్ ప్రచార రథం వారాహికి కొండగట్టులో పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం అక్కడ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసిన ఆర్జీవీ.. పవన్ను స్వామి వివేకానందతో పాలుస్తూ, 'వారాహి'ని పందితో పోలుస్తూ వరుస ట్వీట్లు చేశారు. పవన్ కల్యాణ్.. స్వామి వివేకానంద అని అలాంటి అతను హిట్లర్ వ్యాన్ మీద నుంచి మాట్లాడుతున్నాడు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన కుడికాలిని హిట్లర్ నాకుతాడని ఎడమ కాలిని స్వామి వివేకానంద నాకుతాడని అలాంటి పవర్ కేవలం పవన్ కల్యాణ్కి మాత్రమే ఉంది అంటూ సంచలన కామెంట్లు చేశారు.
ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు 'చైతన్య రథం' మీద తిరిగితే.. మీరు 'పంది బస్సు' మీద తిరుగుతున్నారు అంటున్న తప్పుడు నా కొడుకులందర్నీ జనసేనలతో బస్సు టైర్లకింద తొక్కించేయండి సార్! ఒకవేళ అలా చేయడం లీగల్ గా కుదరదనుకుంటే కనీసం కేసులన్నా పెట్టించండి. ఇది మీ ఫ్యాన్గా నా విన్నపం అంటూ వర్మ ట్వీట్ చేశారు. 'గుడిలో ఉంటే అది 'వారాహి' రోడ్డు మీద ఉంటే అది 'పంది'.. పీ(పవన్ కళ్యాణ్), తన పందికి 'వారాహి' అని పేరు పెట్టుకోవడం ఆ దేవతని దారుణంగా అవమానించినట్టే అని కొన్ని కుక్కలు మొరుగుతున్నాయి. వెంటనే వాళ్ళ నోర్లు మూయించక పోతే మన పవిత్ర 'వారాహి'ని ఒక 'పంది బస్సు' గా ముద్ర వేస్తారు. జై పీకే, జై జనసేన అంటూ వర్మ మరో ట్వీట్ చేశారు. ఆ వెంటనే డియర్ జనసైనికులారా దయచేసి #PandhiBassuVaarahi హ్యాష్ట్యాగ్ని ట్రెండ్ అవ్వకుండా చూసుకోండి అంటూ వరుస ట్వీట్లు చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.