Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ధర్మపురిలో పూజల అనంతరం పవన్ కల్యాణ్ వాహనశ్రేణి మంగళవారం రాత్రి ఏడో నెంబరు రాష్ట్ర రహదారిపై వెళ్తుండగా.. అపశ్రుతి చోటుచేసుకుంది. పవన్ అభిమానులైన కూస రాజ్కుమార్ (20), జక్కుల అంజి బైక్పై అనుసరించారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కిషన్రావుపేట వద్ద అత్యుత్సాహంతో పవన్ వాహన శ్రేణిని అధిగమించబోయి.. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని, కారును ఢీకొట్టారు. ప్రమాదంలో రాజ్కుమార్ మృతి చెందాడు. అంజికి, ఎదురుగా ద్విచక్ర వాహనంపై ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్, నీలం సాగర్లకు తీవ్ర గాయాలయ్యాయి.