Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయమే ప్రతికూలంగా ట్రేడింగ్ను ప్రారంభించిన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. సమయం గడిచిన కొద్దీ అమ్మకాల ఒత్తిడితో సూచీలు భారీ పతనాన్ని చవిచూశాయి. లో
ఓ దశలో సెన్సెక్స్ 850 పాయింట్లకు పైగా కుంగి మదుపర్లను తీవ్ర నష్టాల్లోకి తీసుకెళ్లింది. నెలవారీ, వారాంతపు ఎక్స్పైరీ సూచీలపై ప్రభావం చూపింది. రేపు రిపబ్లిక్ డే సెలవు తరుణంలోలో వీక్లీ ఎక్స్పైరీ ఈరోజే జరిగింది. మరోవైపు బలహీన అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ మదుపర్ల విక్రయాలు, బడ్జెట్ అంచనాలు, ముడి చమురు ధరలు పెరగడం వంటి పరిణామాలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. దీనికి అదానీ గ్రూప్ స్టాక్స్ పతనం కూడా జతకావడంతో సూచీలు భారీ నష్టాల్ని నమోదు చేశాయి.