Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లి
ప్రధానమంత్రి పై బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శనలు జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ జేఎన్యూ తర్వాత జామియా మిలియా క్యాంపస్లో డాక్యుమెంటరీ ప్రదర్శన వాతావరణాన్ని వేడెక్కించింది. వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీ స్క్రీనింగ్కు అనుమతి లేదని యూనివర్శిటీ పరిపాలనా ఉన్నతాధికారులు తెలిపారు. ఈ క్రమంలో సాయంత్రం 6 గంటలకు స్క్రీనింగ్ ప్లాన్ చేయడానికి కొన్ని గంటల ముందు నలుగురు ఎస్ఎఫ్ఐ సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసు అధికారి తెలిపారు.
క్యాంపస్లో డాక్యుమెటరీ ప్రదర్శిస్తున్నట్లు సమాచారం రాగానే నలుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు యూనివర్శిటీ అధికారులు తెలిపారు. డాక్యుమెంటరీ ప్రదర్శనకు ఎలాంటి అనుమతి తీసుకోలేదని, తాము అనుమతి కూడా ఇవ్వలేదని వారు స్పష్టం చేశారు. అరెస్ట్ అయిన వారిలో అజీజ్, నైవేద్య, అభిరాం, తేజస్ ఉన్నట్లుగా సమాచారం. ఎంసీఆర్సీ లాన్ గేట్ నంబర్ 8 వద్ద సాయంత్రం 6 గంటలకు డాక్యుమెంటరీ ప్రదర్శిస్తున్నట్లు తెలిపే పోస్టర్ను ఎస్ఎఫ్ఐ జామియా యూనిట్ విడుదల చేసింది.