Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆదిలాబాద్
ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ లో జరుగతున్న నాగోబా జాతర నేడు ముగిసింది. ఈ నాగోబా జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి. ఈనెల 21న మెస్రం వంశీయులు గంగాజలాన్ని తీసుకువచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరను ప్రారంభించారు. జిల్లాలోని ఆదివాసులంతా జాతరకు వచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ తరుణంలో వారం రోజుల పాటు ఇక్కడే ఉండి సంప్రదాయం ప్రకారం వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఇంద్రవెల్లి మండలంలోని వివిధ గ్రామాల నుంచి ఎడ్ల బండ్లలో వచ్చిన వారు తమ ఎడ్ల బండ్లను తీసుకొని బుధవారం జాతర ముగియడంతో తమ స్వగ్రామానికి బయలుదేరారు.