Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
బీసీ ఆత్మగౌరవ భవనాలను దసరాలోపే ప్రారంభించాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 5న కోకాపేట, 6న ఉప్పల్ భగాయత్లోని స్థలాల్లో ఆయా కుల సంఘాలతో సామూహిక భూమి పూజలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఈ తరుణంలో హైదరాబాద్లో బుధవారం 32 బీసీ కుల సంఘాల ప్రతినిధులతోపాటు బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 41 బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ 87.3 ఎకరాల స్థలాన్ని కేటాయించారని తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో 16, బీసీ సంఘాల సారథ్యంలో 18 భవనాలను నిర్మించనున్నామని తెలిపారు. సంఘాలు నిర్మించే భవనాలకు మార్చి 31లోగా స్లాబుల వరకు నిర్మాణం పూర్తి కావాలని లేని పక్షంలో ప్రభుత్వమే తీసుకుని నిర్మిస్తుందన్నారు.