Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
కృష్ణలంక పోలీస్స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్లో నాలుగు ద్విచక్ర వాహనాలు దహనమయ్యాయి. బాలాజీనగర్ బాలుడు చిమ్మన్న వీధిలో బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో బాంబు పేలినట్లుగా పెద్ద శబ్దం రావడంతో ప్రజలు ఆందోళనతో ఇళ్ల నుంచి బయటకు వచ్చి చూడగా నాలుగు ద్విచక్ర వాహనాలు మంటల్లో కాలిపోతూ కనిపించాయి. వెంటనే నీళ్లు పోసి వాటిని ఆర్పివేశారు. మూడు వాహనాలు పూర్తిగా కాలిపోగా, ఒకటి పాక్షికంగా దెబ్బతింది.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సమీపంలోని సీసీ ఫుటేజీని పరిశీలించగా ఓ వ్యక్తి అదే వీధిలోని 8 ద్విచక్ర వాహనాల్లోని పెట్రోలును అపహరించడం కనిపించింది. సతీష్ నిలయం వద్ద పార్కింగ్ చేసిన వాహనాల్లోని పెట్రోలును దొంగిలించి, అనంతరం అగ్గిపుల్ల గీయడంతో మంటలు రేగినట్లు పోలీసులు భావిస్తున్నారు. బాధితుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.