Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
కుమార్తె వరుసయ్యే ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడి, హత్య చేసిన ఉన్మాదికి ఉరిశిక్ష పడింది. ఒంగోలు రెండో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి, పోక్సో కోర్టు న్యాయమూర్తి (ఇన్ఛార్జి) ఎం.ఎ.సోమశేఖర్ ఈ మేరకు తీర్పునిచ్చారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.వి.రామేశ్వరరెడ్డి కథనం ప్రకారం గిద్దలూరు మండలం అంబవరానికి చెందిన దూదేకుల సిద్దయ్య మద్యానికి బానిస. అతడితో వేగలేక భార్య దూరంగా ఉంటున్నారు. 2021 జులై 8న ఇంటి సమీపంలో ఆడుకుంటున్న చిన్నారిని పిలిచి, లోపలికి తీసుకెళ్లిన సిద్ధయ్య లైంగిక దాడికి ప్రయత్నించాడు.
బాలిక కేకలు వేయడంతో ముఖాన్ని మంచం కోడుకేసి కొట్టాడు. ఆ తర్వాత స్పృహ కోల్పోయిన చిన్నారిపై లైంగిక దాడి చేశాడు. కాసేపటికి ఆమె చనిపోవడంతో మృతదేహాన్ని ప్లాస్టిక్ గోతంలో మూట కట్టి, సైకిల్పై పెట్టుకుని, ఊరి శివారులోని చిల్లచెట్లలో పడేసి పరారయ్యాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కేసు విచారణలో సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడికి మరణశిక్ష విధిస్తూ బుధవారం తీర్పు ఇచ్చారు. బాలిక తల్లిదండ్రులకు రూ.10 లక్షలు పరిహారం అందించాలని ప్రభుత్వానికి సూచించారు