Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాద్యం భయాలలో ఐటీ కంపెనీలు క్రమంగా ఖర్చులను తగ్గించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ మల్టీనేషనల్ టెక్ కంపెనీలైన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. మరింత మందిని వదిలించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి.
తాజాగా ఈ జాబితాలో ఐటీ దిగ్గజం ఐబీఎం కూడా చేరింది. కంపెనీలోని 3900 మంది ఉద్యోగులను తీసేస్తూ నిర్ణయం తీసుకున్నది. వార్షిక నగదు లక్ష్యాలు తగ్గడంతోపాటు కొన్ని అసెట్ డివెస్ట్మెంట్ల కారణంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం ఉద్యోగుల్లో ఇది 1.5 శాతం మాత్రమేనని తెలిపింది. అయితే క్లయింట్-ఫేసింగ్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాల్లో నియామకాలు కొనసాగిస్తామని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జేమ్స్ కవనాగ్ తెలిపారు.