Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో పెళ్ళి జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. గుండెపోటుతో యువకుడు మృతి చెందడం ఆ కుటుంబానికి తీరని గుండెకోతను మిగిల్చింది. పట్టణంలోని రావుల శంకరయ్యచారి, భూలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు రావుల సత్యనారాయణాచారి(34)కి జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన యువతితో శుక్రవారం వివాహం జరగాల్సి ఉంది.
బుధవారం అర్ధరాత్రి వరకు కుటుంబసభ్యులతో కలిసి పెళ్లి వేడుకల ఏర్పాట్లలో నిమగ్నమైన సత్యనారాయణాచారి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని ఉట్నూరులోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం సత్యనారాయణాచారి మృతిచెందాడు.