Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హిందూపురం
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు గురువారం సాయంత్రం త్రుటిలో ప్రమాదం తప్పింది. ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రజలకు అభివాదం చేసి వెనుదిరిగే సమయంలో వాహనం ముందుకు కదలడంతో నిల్చున్న బాలకృష్ణ ఒక్కసారిగా వెనక్కితూలి పడబోయారు. వెంటనే పట్టభద్రుల టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి గోపాల్రెడ్డి, పార్టీ నాయకులు ఆయనను పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది.