Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హైదరాబాద్
అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 455 పాయింట్ల నష్టంతో 59,749 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 125 పాయింట్లు నష్టపోయి 17,766 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.51 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, టాటా స్టీల్, ఐటీసీ, మారుతీ, బజాజ్ ఫిన్సర్వ్, ఎల్అండ్టీ, బజాజ్ ఫైనాన్స్ లాభాల్లో ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.