Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుమల
శ్రీవారి భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త మొబైల్ యాప్ను రూపొందించింది. టీటీ దేవస్థానమ్స్ పేరుతో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. జియో ప్లాట్ఫామ్ ద్వారా యాప్ను అభివృద్ధి చేసినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ యాప్ ద్వారా ఎస్వీబీసీ భక్తి ఛానల్లో వచ్చే కార్యక్రమాల ప్రత్యక్షంగా వీక్షించవచ్చని, దర్శనం, గదులు, ఆర్జిత సేవా టికెట్లను భక్తులు నేరుగా బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించనున్నట్లు ప్రకటింది. ఈ యాప్లో తిరుమల చరిత్ర, స్వామివారి కైంకర్యాల వివరాలను పొందుపరిచినట్లు వెల్లడించింది.