Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -హైదరాబాద్
మంత్రి పువ్వాడ అజయ్కు కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు నోటీసు జారీ చేసింది. మమత మెడికల్ కాలేజీ ఛైర్మన్ హోదాలో ఆయనకు కోర్టు నోటీసు ఇచ్చింది. పీజీ వైద్య కోర్సులకు 2016 జీవో ప్రకారం పాత ఫీజు తీసుకోవాలని వైద్య కళాశాలలకు గతేడాది హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ, మమత మెడికల్ కాలేజీ పీజీ వైద్య కోర్సులకు 2017జీవో ప్రకారం పెంచిన ఫీజులు వసూలు చేసింది. దీంతో కాలేజీలు వసూలు చేసిన అధిక ఫీజు విద్యార్థులకు వెనక్కి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ తరుణంలో మమత మెడికల్కాలేజీ తమకు రావాల్సిన ఫీజు తిరిగి ఇవ్వడం లేదని కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. దీనిపై వివరణ ఇవ్వాలని పువ్వాడ అజయ్కి నోటీసులు ఇచ్చిన ధర్మాసనం తదుపరి విచారణను ఏప్రిల్ 17కి వాయిదా వేసింది.