Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సికింద్రాబాద్, హైదరాబాద్ సబర్బన్కు సంబంధించిన 19 ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులను ఈ నెల 28 నుంచి మార్చి 25 వరకు ప్రతి శనివారం రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత తిరిగి యథావిధిగా నడుస్తాయన్నారు. పలు మరమ్మతుల కారణాల వల్ల 19 సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపారు. ఇందులో లింగంపల్లి ఉ హైదరాబాద్ మధ్య ఐదు సర్వీసులు, ఫలక్నుమా ఉ లింగంపల్లి స్టేషన్ల మధ్య 11 సర్వీసులు రద్దు చేశారు. అలాగే ఫలక్నుమా ఉ హైదరాబాద్ మధ్య ఒకటి, రామచంద్రాపురం ఉ ఫలక్నుమా స్టేషన్ల మధ్య రెండు చొప్పున లోకల్ సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.