Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఫలితాలు విడుదల చేసింది ఏపీపీఎస్సీ. ఫలితంగా ఏపీపీఎస్సీ చరిత్రలోనే రికార్డు టైంలో 20 రోజుల్లోనే ఫలితాలను ప్రకటించినట్లయ్యింది. జనవరి 8వ తేదీన 111 పోస్టులకు గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్షలు నిర్వహించింది ఏపీపీఎస్సీ. ప్రిలిమనరీ పరీక్షలకు 88 వేల మంది నిరుద్యోగులు హాజరు కాగా, 1:50 నిష్పత్తిలో ప్రిలిమనరీ ఫలితాలను ప్రకటించింది ఏపీపీఎస్సీ. దాంతో గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్షలో 6,455 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. 20 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేయడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఏప్రియల్ 23వ తేదీన గ్రూప్-1 మెయిన్ పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహించనుంది.