Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
బాపట్ల జిల్లా చెరుకుపల్లికి చెందిన కూరపాటి నోవాబాబు మూడున్నరేళ్లుగా చెరుకుపల్లి-1 సచివాలయ పరిధిలోని క్లస్టర్-9లో వాలంటీరుగా పనిచేస్తున్నాడు. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన మద్యాన్ని చెరుకుపల్లి ఖాదర్ఖాన్ సెంటర్లో అక్రమంగా విక్రయిస్తున్నారన్న సమాచారంతో సీఐ దేవర శ్రీనివాస్ నిఘా పెట్టారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత వాలంటీరు నోవాబాబు తెలంగాణకు చెందిన మద్యం సీసాలు విక్రయిస్తుండగా దాడిచేసి పట్టుకున్నారు. అతడ్ని అదుపులోకి తీసుకున్న సమయంలో తాను వైకాపాకు చెందిన వ్యక్తినని, స్థానికంగా ఉన్న కొందరు వైకాపా నేతలు మద్దతుగా ఉన్నారంటూ బెదిరించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.