Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇరాన్లో భారీ భూకంపం సంభవించింది. టర్కీ సరిహద్దుల్లోని ఖోయ్ సిటీ ప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత 5.9గా నమోదయింది. భూకంప ప్రభావంతో ఖోయ్, అజర్బైజాన్ ప్రావిన్సుల్లో పలు భవనాలు నేలమట్టాయ్యాయి. దీంతో ఏడుగురు మృతిచెంగా, 440 మంది గాయపడ్డారని ఇరాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్రతినిథి ముజ్తబా ఖలేదీ వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. భూప్రకంపనలు నమోదైన ప్రాంతాల్లో.. కనిష్ఠ ఉష్ణోగ్రతలతో పాటు భారీగా మంచు కురుస్తున్నది. ఫలితంగా సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. అనేక ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోయిందని చెప్పారు.